ప్రజలపై విధిస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీల భారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనికి అది తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని ఎమ్మెల్సీ డాక్టర్ కె నాగేశ్వర్ అన్నారు. 'విద్యుత్ ఛార్జీల పెంపు - ఎఫ్ఎస్ఏలు' అంశంపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ (ఫాకా) ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎస్ఏలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ను అధిక ధరకు కొనాలని ప్రభుత్వానికి ఎవరు సూచించారని ప్రశ్నించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్ కొనుగోలు ఛార్జీలు పెరిగాయని, దీనికి ప్రజల్ని బాధ్యుల్ని చేస్తూ వారిపై భారాలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలోని జెన్కోను ఉద్దేశ్యపూర్వంగానే నిర్వీర్యం చేస్తున్నారని, ల్యాంకో, జిఎంఆర్ వంటి మర్చంట్ పవర్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు చేసి జెన్కో ఆధ్వర్యంలోని కరీంనగర్ జిల్లా నేదునూరు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గ్యాస్ ప్లాంట్లకు కేటాయింపులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బడా కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్రజలపై సర్ఛార్జీల భారం పడుతోందని విమర్శించారు.
ఎఫ్ఎస్ఏల వల్ల కిరాయిదార్లపై పెనుభారం పడుతోందని, చివరకు పారిశ్రామికవేత్తలు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాల్సిన దుర్గతి పట్టిందంటే ప్రభుత్వ విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. భవిష్యత్తులో మరింత బలమైన విద్యుత్ ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు మరిన్ని రూపాల్లో అవగాహన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఫాకా నాయకులు వెంకటాచారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతోపాటు వెంటవెంటనే అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజలు ఐక్యం కాకుండా చూస్తోందన్నారు. ఫాకా నగర కార్యదర్శి వి కామేష్బాబు మాట్లాడుతూ ఎఫ్ఎస్ఏలపై ప్రజల్ని మరింత చైతన్యవంతుల్ని చేసేందుకు జోనల్ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఏ, విద్యుత్ ఛార్జీలను తగ్గించి, రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికల్ని ప్రభుత్వం రూపొందించాలని, దీని కోసం సంక్షేమ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని కోరుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో ఫాకా సలహాదారు ఎన్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై విధిస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీల భారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనికి అది తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని ఎమ్మెల్సీ డాక్టర్ కె నాగేశ్వర్ అన్నారు. 'విద్యుత్ ఛార్జీల పెంపు - ఎఫ్ఎస్ఏలు' అంశంపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ (ఫాకా) ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎస్ఏలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ను అధిక ధరకు కొనాలని ప్రభుత్వానికి ఎవరు సూచించారని ప్రశ్నించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్ కొనుగోలు ఛార్జీలు పెరిగాయని, దీనికి ప్రజల్ని బాధ్యుల్ని చేస్తూ వారిపై భారాలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలోని జెన్కోను ఉద్దేశ్యపూర్వంగానే నిర్వీర్యం చేస్తున్నారని, ల్యాంకో, జిఎంఆర్ వంటి మర్చంట్ పవర్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు చేసి జెన్కో ఆధ్వర్యంలోని కరీంనగర్ జిల్లా నేదునూరు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గ్యాస్ ప్లాంట్లకు కేటాయింపులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బడా కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్రజలపై సర్ఛార్జీల భారం పడుతోందని విమర్శించారు.
ఎఫ్ఎస్ఏల వల్ల కిరాయిదార్లపై పెనుభారం పడుతోందని, చివరకు పారిశ్రామికవేత్తలు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాల్సిన దుర్గతి పట్టిందంటే ప్రభుత్వ విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. భవిష్యత్తులో మరింత బలమైన విద్యుత్ ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు మరిన్ని రూపాల్లో అవగాహన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఫాకా నాయకులు వెంకటాచారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతోపాటు వెంటవెంటనే అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజలు ఐక్యం కాకుండా చూస్తోందన్నారు. ఫాకా నగర కార్యదర్శి వి కామేష్బాబు మాట్లాడుతూ ఎఫ్ఎస్ఏలపై ప్రజల్ని మరింత చైతన్యవంతుల్ని చేసేందుకు జోనల్ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఏ, విద్యుత్ ఛార్జీలను తగ్గించి, రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికల్ని ప్రభుత్వం రూపొందించాలని, దీని కోసం సంక్షేమ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని కోరుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో ఫాకా సలహాదారు ఎన్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment